సిరా న్యూస్,మేడ్చల్;
మేడ్చల్ జిల్లా ఘట్ కేసర్ రైల్వే స్టేషన్ పరిధి యంనంపేట్ లో ఎలిమినేటి సాయినాథ్ రెడ్డి(28) అనే యువకుడు రైల్ కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడు రాంపల్లి ఆర్ ఎల్ నగర్ లో నివాసముంటున్నాడు. సికింద్రాబాద్ రైల్వే పోలీసులు సంఘటన స్థలాన్ని చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. పోస్టుమార్టం నిమిత్తం బాడిని గాంధీ మార్చురీకి తరలించారు.