సిరా న్యూస్, డిజిటల్:
యువత… రేపటి భవితకు భరోసా
+ ఆదర్శంగా నిలుస్తున్న జైనథ్ యువకులు
యువత అంటే బలాదూర్గా తిరిగే రోజులు పోయాయ్… యువత అంటే కుటుంబానికి భారంగా మారి, వ్యసనాలతో సహవాసం చేసే రోజులు పోయాయ్.. నేడు యువత అంటే బాధ్యత… యువత అంటే నమ్మకం… యువత అంటే నలుగురికి ఆదర్శం… నేడు ఏ గ్రామంలో చూసిన, యువత అన్ని రంగాల్లో దూసుకెళ్తూ గ్రామాభివృద్ధిలో సైతం క్రియాశీలక పాత్ర పోషిస్తున్నారు. ఇటు సమాజ సేవ చేస్తూనే, అటు రాజకీయాల్లో సైతం చురుకైన పాత్రను పోషిస్తున్నారు. నేడు ఏ గ్రామానికి వెళ్లిన… యువకులు నలుగురికి సహాయం చేస్తూనో, వ్యవసాయం చేస్తూనో కనిపిస్తున్నారే తప్ప ఖాళీగా లేరు. ముఖ్యంగా దేశం కోసం, ధర్మం కోసం, సమాజం కోసం పనిచేయడానికి ఎల్లవేళల ముందు వరుసలోఉంటున్నారు. ఉద్యోగాలు లేకున్నా, స్వయం ఉపాధి చేసుకుంటూ సైతం నలుగురుకి సహాయపడాలని తాపత్రాయ పడుతున్నారు. భక్తిభావనను పెంపొందించుకుంటూ, సమాజ సేవకై కదులుతున్నారు. ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండల కేంద్రంలో మంగళవారం ఆయోధ్య అక్షింతల పంపిణీ కార్యక్రమం నిర్వహించగా, పార్టీలకు అతీతంగా పెద్ద సంఖ్యలో యువకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తిప్పిరెడ్డి రాకేష్ రెడ్డి, సామా రమేష్ రెడ్డి, చిల్కూరి లింగారెడ్డి, ముక్కెర లక్ష్మణ్ యాదవ్, పిడుగు స్వామి యాదవ్, ఏనుగు ఆశీష్ రెడ్డి, బంగారి సాయి, తదితరులు ఇంటింటికి అక్షింతలు పంచి, కార్యక్రమాన్ని విజయవంతం చేసారు. ఇలా యువకులు ముందుండి అన్ని తామై నడిపించడంతో గ్రామంలోని పెద్ద మనుషులు సంబరపడిపోతూ, యువకులను అభినందిస్తున్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ దుమాల దేవన్న, ఎంపిటీసీ కొడిచర్ల సుదర్శన్, ఇతర నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.