కుటుంబ సభ్యుల పాత్ర పై అనుమానం
అదుపులోకి తీసుకున్న పోలీసులు
సిరా న్యూస్,హుజురాబాద్;
హుజురాబాద్ మండల కేంద్రంలోని రాజుపల్లి గ్రామ పంచాయతీకి చెందిన నోముల రాజు (30) అనుమాన స్థితిలో హత్య చేయబడ్డాడు.శుక్రవారం రోజున నోముల చంద్రయ్య, ఎల్లమ్మ తన కుమారుడు ఇంకా లేవలేదని ఇంటి వద్దకు వెళ్లి చుట్టుపక్కల వారికి తెలియజేశారు.వారు ఇంటికి వెళ్లి చూడగా రాజు చనిపోయి ఉన్నాడు. పోలీసులకు సమాచారం చేరవేసినారు. ఏసీపి శ్రీనివాస్ జి, టౌన్ సిఐ తిరుమల గౌడ్, ఎస్సై యూనస్ సంఘటన స్థలానికి వెళ్లి పరిశీలించి రాజు హత్యకు గురైనట్లు అనుమానం వచ్చి అంచంపై పడి ఉన్న మృతుడి నుతిటి పై బలమైన ఆయుధంతో కొట్టినట్లు ఆనవాళ్లు కనిపించాయి. మంచం చుట్టూ రక్తం మరకలు గమనించిన పోలీసులు మృతిని తల్లిదండ్రులు వారి తమ్ముడుని పోలీసులుఅదుపులోకి తీసుకున్నారు. మృతుడు కొన్ని రోజుల నుండి తల్లిదండ్రులతో గొడవపడుతుండేవాడని గ్రామస్తులు తెలియజేశారు. మృతుని తమ్ముడు నోముల అంజి హైదరాబాదులో కారు నడుపుకుంటూ జీవిస్తున్నాడు. గత నాలుగు రోజుల నుండి రాజ పల్లె గ్రామంలో ఇంటి వద్ద ఉంటున్నాడ అని గ్రామస్తులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. మృతదేహాన్ని హుజురాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.