పెందుర్తి జంక్షన్లో ఆదివారం రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రచార సభ
– వైయస్సార్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి అన్నంరెడ్డి అదీప్ రాజ్ కు మద్దతు తెలుపుతూ మండల వైకాపా శ్రేణులు రెడీ అవ్వాలని పిలుపును ఇచ్చినా పయిల శ్రీనివాసరావు
సిరా న్యూస్,పరవాడ;
రాష్ట్రములో వైస్సార్సీపీ అధ్యక్షుడు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తలపెట్టిన ఎన్నికల ప్రచారంలో భాగంగా మేమంతా సిద్ధం బస్సు యాత్ర ఉత్తరాంధ్రలోకి ప్రవేశించింది. ఉమ్మడి విశాఖ జిల్లా, ప్రస్తుత అనకాపల్లి జిల్లాలో బస్సు యాత్రకు ప్రజలు అడుగడుగునా బ్రహ్మరథం పడుతున్నారు. మళ్లీ జగనే సీఎం కావాలంటూ జనం ముక్తకంఠంతో చెబుతున్నారు. బస్సు యాత్ర వైయస్ఆర్ సీపీ శ్రేణుల్లో నూతనోత్సాహాన్ని నింపుతోంది. జననేత కోసం జనం మండే సూరీడును సైతం లెక్క చేయడం చేయడం లేదు. దారి పొడవునా తీన్మార్లు, డప్పుల సందడితో ఎక్కడ చూసినా అభిమానులు సందడి చేస్తున్నారు. బస్సు యాత్ర జన ప్రవాహాన్ని తలపిస్తోంది. తేది 21/04/2024 ఆదివారం ఉదయం 8 గంటలకు రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్మోహన్ రెడ్డి పెందుర్తి నియోజకవర్గం హెడ్ క్వార్టర్ అయ్యిన పెందుర్తి కూడలికి వద్ద పెందుర్తి వైసిపి ఎమ్మెల్యే అభ్యర్థి అన్నం రెడ్డి అదీప్ రాజ్ గెలుపు కోసం ప్రచారం సభలో పాలొగొన్నారు దీనికి పరవాడ మండలంలో గల ఎంపీపీ,జెడ్పీటీసీ,వైస్ ఎంపీపీలు,సర్పంచ్ లు,ఎంపీటీసీలు,మాజీ సర్పంచులు ,మాజీ ఎంపీటీసీ లు,ముఖ్యనాయకులు,కార్యకర్తలు,అభిమానులు అందరూ సభకు విచ్చేసి వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఘనస్వాగతం పలకవల్సిందిగా పార్టీ సీనియర్ నాయకుడు, సిఈసి సభ్యుడు పయిల శ్రీనివాసరావు పిలుపునిచ్చారు.