సిరా న్యూస్, కుందుర్పి
రైతు దేవరాజు కుటుంబానికి రూ.5వేలు అందజేత: వైఎస్ఆర్సీపీ నాయకుడు ఎస్.బాబు
కుందుర్పి గ్రామానికి చెందిన యువ రైతు దేవరాజు విద్యుద్ఘాతంతో మృతి చెందాడు. ఈవిషయం తెలుసుకున్న వైఎస్ఆర్సీపీ యువ నాయకుడు ఎస్. బాబు మంగళవారం బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. అనంతరం బాధిత కుటుంబానికి రూ. 5వేలు ఆర్థిక సాయం అందజేశారు. ఆయన వెంట వైసీపీ నాయకులు, గ్రామ సర్పంచ్ కొమ్మ హనుమంతరాయుడు, ఎంపీటీసీ ఓబిలేసు, రామదాసు, లెనిన్ బాబు తదితరులు ఉన్నారు.