YSR: సైదాపూర్‌లో వైఎస్. రాజశేఖర్ రెడ్డి జయంతి వేడుకలు

సిరాన్యూస్‌, సైదాపూర్
సైదాపూర్‌లో వైఎస్. రాజశేఖర్ రెడ్డి జయంతి వేడుకలు

సైదాపూర్ మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సోమ‌వారం మాజీ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి 75వ జయంతి వేడుకల‌ను ఘ‌నంగా నిర్వ‌హించారు. ఈసంద‌ర్భంగా నాయ‌కులు వైయస్సార్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ వైయస్ రాజశేఖర్ రెడ్డి ప్రవేశ పెట్టిన 104, 108 లాంటి సంక్షేమ పథకాలు ప్రజలు మదిలో ఇప్పటికి పదిలంగా ఉన్నాయని వారు గుర్తుచేశారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు దొంత సుధాకర్, మాజీ మండల అధ్యక్షుడు రవీందర్రావు, జిల్లా అధికార ప్రతినిధి మేకల రవీందర్, ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడు లంకదాసరి మల్లయ్య, బీసీ సెల్ మండల అధ్యక్షుడు పోగు రమేష్, మాజీ వైస్ ఎంపీపీ కొత్త మల్లారెడ్డి, కొత్త మహేందర్ రెడ్డి, గ్రామశాఖ అధ్యక్షులు గొల్లపల్లి యాదగిరి, కరుణాకర్, సంపత్, సమ్మయ్య, బీరయ్య, చంద్రమౌళి, యూత్ కాంగ్రెస్ నాయకులు తిరుపతి నాయక్, రాహుల్, సందీప్, అనిల్, కాంగ్రెస్ నాయకులు బొమ్మగాని రాజు, సంతోష్, కొమురయ్య తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *