సిరా న్యూస్,విశాఖపట్నం;
రాజ్యసభ సభ్యులుగా నూతనంగా ఎంపికైన సందర్భంగా వైవీ సుబ్బారెడ్డి సోమవారం విశాఖ శారదాపీఠాన్ని సందర్శించారు. రాజశ్యామల అమ్మవారి ఆలయాన్ని సందర్శించి పూజలు చేశారు. అనంతరం స్వరూపానందేంద్ర, స్వాత్మానందేంద్ర స్వాముల ఆశీస్సులు అందుకున్నారు. రాజ్యసభ సభ్యుని హోదాలో కార్యదక్షతతో పనిచేసేలా దీవించమని పీఠాధిపతులను వైవీ సుబ్బారెడ్డి కోరారు. అమ్మవారి అనుగ్రహంతో శక్తవంచన లేకుండా పని చేస్తానని తెలిపారు.