సిరా న్యూస్, ఆదిలాబాద్:
జిల్లా అభివృద్ధికి సహకరించాలి…
– జడ్పీ చైర్మెన్ రాథోడ్ జనార్దన్
+ నుతంగా ఎన్నికైన ఎమ్మెల్యేలకు ఘన సన్మానం
జిల్లా అభివృద్ధికి అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పని చేయాలనీ జిల్లా పరిషత్ చైర్మన్ రాథోడ్ జనార్దన్ అన్నారు. శనివారం జడ్పీ సమావేశ మందిరంలో నిర్వహించిన జిల్లా పరిషత్ సర్వ సభ్య సమావేశంలో అదనపు కలెక్టర్ ఖుష్బుగుప్త తో కలిసి ఆయన పాల్గొన్నారు. ముందుగా విద్యా, మిషన్ భగీరథ, రహదారులు, భవనాల శాఖ, పంచాయితీ, గ్రామీణాభివృద్ధి, వైద్యం, ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనారిటీ సంక్షేమం, టీఎస్ ఆర్టీసీ, శిశు సంక్షేమం, పౌర సరఫరాలు, వ్యవసాయ మార్కెటింగ్, పశు సంవర్ధక, పరిశ్రమలు, గృహనిర్మాణం, మత్స్య, సహకార వంటి శాఖల ద్వారా చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల పురోగతిపై సమావేశంలో చర్చించారు. ఈ సందర్బంగా జడ్పీ చైర్మన్ మాట్లాడుతూ, ప్రభుత్వ సంక్షేమ పథకాలను అర్హులైన లబ్దిదారులకు అందేలా అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో చర్యలు చేపట్టాలని సూచించారు. ఆయా మండలాల ప్రజాప్రతినిధులు లేవనెత్తిన సమస్యలను సంబంధిత శాఖల అధికారులు క్షేత్ర స్థాయిలో పరిశీలించి పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు. సర్వ సభ్య సమావేశంలో నూతనంగా ఎన్నికైన ఆదిలాబాదు, బోథ్, ఖానాపూర్ శాసన సభ్యులు పాయల్ శంకర్, అనిల్ జాదవ్, వెడ్మ బొజ్జు లను జడ్పీ చైర్మన్, అదనపు కలెక్టర్, ప్రజాప్రతినిధులు, అధికారులు శాలువాలు, పూలబొకేలతో ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సమావేశంలో జడ్పీ సీఈఓ గణపతి, ఆయా మండల జడ్పీటీసీ లు, ఎంపీపీ లు, వివిధ శాఖల జిల్లా అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.