సిరా న్యూస్, బజార్ హత్నూర్:
జాతీయ స్థాయి ఖోఖో పోటీలకు ఎంపిక..
బజార్ హత్నూర్ మండలం గిర్నూర్ లోని శ్రీ రాజ రాజేశ్వర డిగ్రీ కళాశాల లో బి ఎ ద్వితీయ సంవత్సరం చదవుతున్న విద్యార్ధి మడావి ప్రశాంత్ ఇంద్రవెళ్లి మండలం బుర్సన్ పట్టార్ కోలం గూడ కు చెందిన వ్యక్తి జాతీయ స్థాయి ఖోఖో పోటీలకు ఎంపిక అయ్యడు. ఈ నెల 26 నుండి 30 వరకు కేరళ లోని కాలికట్ యూనివర్సిటీ లో జరిగే విశ్వ విద్యాలయ పోటీలో కాకతీయ యూనివర్సిటీ జట్టుకు ప్రాతనిథ్యం వహించనున్నాడు. ఈ విద్యార్థికి కళాశాల కరస్పాండెంట్ అభినందనలు తెలిపారు. జాతీయ స్థాయిలో మంచి ప్రదర్శన కనబర్చి భవిషత్తులో ముందుకు వెళ్లాలని గ్రామస్థులు ఆశాభావం వ్యక్తం చేసారు.