నియోజవర్గ అభివృద్ధికి అందరూ కలసి కట్టుగా పనిచేద్దాం అనిల్ జాదవ్..

సిరా న్యూస్, బోథ్ :

నియోజవర్గ అభివృద్ధికి అందరూ కలసికట్టుగా పనిచేద్దాం అనిల్ జాదవ్..

బోథ్ మండల కేంద్రములో గల స్థానిక ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో నిర్వహించిన అధికారుల సమావేశ ముఖ్య అతిథిగా పాల్గొన్న  బోథ్ శాసన సభ్యులు అనిల్  జాదవ్. ముందుగా తను శాసన సభ్యులు గెలిచిన తరువాత మొదటి సారిగా కార్యాలయానికి వచ్చిన సందర్భంగా ప్రత్యేక పూజలు చేసి క్యాంపు కార్యాలయ వరండాలో మొక్కనాటి బాధ్యతలు స్వీకరించారు. అనంతరం అక్కడే నిర్వహించిన అధికారుల, ప్రజా ప్రతినిధుల  సమావేశంలో  మాట్లాడుతూ..అధికారులు ,ప్రజా ప్రతినిధులు అందరూ ప్రజలకు అందుబాటులో ఉండాలని .ప్రజా సమస్యలపై దృష్టి సారించింది ప్రజల వద్దకే పాలన సాగించాలని.బోథ్ నియోజకవర్గ అభివృద్ధికి పథంలో నడిపించాలని.నేను మీ అందరికీ ఎల్లవేళల అందుబాటులో ఉంటాను అని తెలిపారు .ఈ కార్యక్రమంలో బోథ్ ఎంపీపీ తుల శ్రీనివాస్, జెడ్పీటీసీ సభ్యురాలు సంధ్యారాణి,ఏఎంసి  చైర్మన్ రుక్మన్ సింగ్,మండల కన్వీనర్ నారాయన్ రెడ్డి, ఇచ్చోడ ఎంపీపీ నిమ్మల ప్రితం రెడ్డి,ఎంపీపీ సజన్ రాథోడ్, జెడ్పీ కో ఆప్షన్ సభ్యులు తాహిర్,స్థానిక సర్పంచ్ సురేందర్ యాదవ్,సర్పంచుల సంఘం అధ్యక్షులు శ్రీధర్ రెడ్డి,పెంట వెంకటరమణ, ముండే పాండురంగ్, వివిధ శాఖల అధికారులు ప్రజా ప్రతినిధులు నాయకులు కార్యకర్తలు, వివిధ శాఖల చైర్మన్, డైరెక్టర్లు  తదితరులు పాల్గొన్నారు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *