సాయి లింగిలో ఘనంగా సాయిబాబా ఆలయ వార్షికోత్సవం..

సిరాన్యూస్, తలమడుగు:
సాయి లింగిలో ఘనంగా సాయిబాబా ఆలయ వార్షికోత్సవం..
భక్తులతో కిటకిటలాడిన సాయి గ్రామం..

సాయిలింగి గ్రామంలో శ్రీ సాయి బాబా 23వ ఆలయ వార్షికోత్సవ వేడుకలను ఆలయ వ్యవస్థాపకులు దెబ్బడి అశోక్, గ్రామస్తులు ఘనంగా నిర్వహించారు. ఆలయ వార్షికోత్సవం పురస్కరించుకొని గత మూడు రోజుల నుండి ఆలయంలో భక్తులు యజ్ఞాలు, హోమాలు, ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు. మంగళవారం చివరి రోజు కావడంతో వేద పండితులు మంత్రోచ్ఛారణలతో పూర్ణహుతి గావించారు. చివరి రోజు జాతర ను ఏర్పాటు చేయడంతో ఆలయ పరిసరాల చుట్టూ భారీ ఎత్తున దుకాణాలు వెలిసాయి. ఆలయానికి వచ్చిన భక్తులతో దుకాణాల దగ్గర సందడి వాతావరణం ఏర్పడింది. ఈ సందర్భంగా వేద పండితులు రాంగోపాల్ చారి మాట్లాడుతూ… 23 సంవత్సరాల క్రితం దెబ్బడి అశోక్ శ్రీ సాయిబాబా ఆలయాన్ని గ్రామంలో నెలకొల్పడం జరిగిందన్నారు. ప్రతి సంవత్సరం గ్రామస్తుల సహకారంతో వేద పండితులతో యజ్ఞాలు, హోమాలతో పాటు ప్రత్యేకపూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. దీంతోపాటు వృద్ధాశ్రమాన్ని సైతం నెలకొల్పిన ఆయన ఎందరో మంది అనాధలైన వృద్ధులను ఆదుకుంటున్నారని అన్నారు. ఆలయం నెలకొల్పిన నాటి నుండి గ్రామం పాడిపంటలతో, ఆయురారోగ్యాలతో సుభిక్షంగా ఉందన్నారు. కాగా తలమడుగు జడ్పిటిసి గోక గణేష్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల కన్వీనర్ కళ్యాణం రాజేశ్వర్ దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్థానిక సర్పంచ్ జంగాల రేవతి పోచ్చన్న, మాజీ సర్పంచ్ పోచ్చన్న, నాయకులు తోట అశోక్, రాగి రాంకిషన్, బిఆర్ఎస్ పార్టీ కన్వీనర్ తోట వెంకటేష్, నాయకులు ప్రమోద్, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *