గంపలగూడెంలో ఒకే ఇంట్లో 100 పాములు

సిరా న్యూస్,తిరువూరు;
గంపలగూడెం మండల కేంద్రంలోని పడమట దళితవాడకు చెందిన కోట రజిని ఇంటి ఆవరణలో 100 వరకు పాములు కలకలం రేపాయి. ప్రహారి గోడకి పడ్డ కన్నంలో పాములు కనిపించాయి. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ఒకే చోట చేరి గుట్టగా తయారైనట్లు స్థానికులు చర్చించుకుంటున్నారు. వాటిని గమనించిన ఆ ఇంటి యజమానులు, చుట్టుపక్కల స్థానికులకు సమాచారం ఇవ్వగా అవి వాన పాములుగా గుర్తించారు. వాటిని బయటకు తీసి బయటికి పడవేశారు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *