సిరా న్యూస్,సంగారెడ్డి;
జిల్లాలో సోమవారం నుంచి పదవతరగతి పరీక్షలు ప్రారంభం అయ్యాయి. పఠాన్ చేరు నియోజకవర్గంలో 29 పరీక్ష కేంద్రాలు వున్నాయి. 6.835 మంది విద్యార్థులు హాజరు కానున్నారు. నియోజకవర్గం వ్యాప్తంగా పదో తరగతి పరీక్షలకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసారు. ఉదయం 9 గంటల 30 నిమిషాలకు ప్రారంభమయ్యే పరీక్షలకు అరగంట ముందే లోపలికి అనుమతి వుంటుంది. పరీక్ష కేంద్రాల్లోకి అనుమతికి ఐదు నిమిషాల అదనపు సమయం అనుమతించారు.