అంగన్వాడీలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి
అంగన్వాడీల సమ్మెకు మద్దతు తెలిపిన ఎస్.ఎఫ్.ఐ, కే.వి.పి.ఎస్ బిసి చైతన్య సమితి నాయకులు.
సిరా న్యూస్,బద్వేలు;
అంగన్వాడీ వర్కర్ల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఏపీ అంగన్వాడీ వర్కర్స్ @ హెల్పర్స్ యూనియన్ (సిఐటియు) బద్వేల్ ప్రాజెక్టు కమిటీ ఆధ్వర్యంలో 9 రోజు రాష్ట్ర వ్యాప్త సమ్మెలో భాగంగా బుధవారం బద్వేల్ ఐసీడీఎస్ కార్యాలయం నుండి ప్రధాన రహదారులంబడి అంగన్వాడీ కార్యకర్తలు చేసి ప్రభుత్వానికి వేతిరేకంగా బిక్షాటన కార్యక్రమం చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఎస్.ఎఫ్.ఐ జిల్లా కార్యదర్శి గండి సునీల్ కుమార్ బీసి చైతన్య రాష్ట్ర సమితి రమణ మాట్లాడుతూ…
అంగన్వాడీలతో పాటు సామాన్య జనాన్ని కూడా ముఖ్యమంత్రి మోసం చేశారని, అంగన్వాడి సిబ్బందిని వేదిస్తున్నారని, అసలు విధులు పక్కనపెట్టి పార్టీ కార్యక్రమాలకు వెళ్ళమంటున్నారని, వారికి గట్టి సమాధానం చెప్పాలని సూచించారు. తాము ఆడవాళ్ళం కాదు మహాశక్తులమని గుర్తించేలా చేయాలన్నారు. తనకు మించిన మహిళా పక్షపాతి మరెవరు లేనట్టు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఊక దంపుడు ఉపన్యాసాలు ఇచ్చిన జగన్…. అదే మహిళలు తమ సమస్యల ను పరిష్కరించాలని పలుమార్లు రోడ్డు ఎక్కి నిరసన తెలుపుతున్నా… ఆందోళన చేస్తున్నా….. కనీసం వారి సమస్యలు ఏంటని అడిగిన పాపాన పోలేదని,వైకాపా ప్రభుత్వం అధికారం చేపట్టగానే 2019 జూన్ లో అంగన్వాడీ కార్యకర్తల వేతనాన్ని రూ.1,000/- రూపాయలు చొప్పున పెంచింది. దీంతో వారి వేతనం 11,500 చేరింది. ఒక చేత్తో ఇచ్చి మరో చేత్తో లాక్కోవడంలో ఆరితేరిపోయిన జగన్ అంగన్వాడీలకు రూ.1,000/- పెంచి వారికి ఇచ్చే సంక్షేమ పథకాలకు ఎసరు పెట్టారు. రూ.1,000/- పెంపుతో గ్రామీణ ప్రాంతాల్లోని అంగన్వాడీ కార్యకర్తల వేతనం నవరత్నాల పథకాల అమలకు నిర్దేశించిన రూ.10,000 ఆదాయ పరిమితి నిబంధనను దాటిపోయింది. దీంతో సంక్షేమ పథకాలు వారికి వర్తించకుండా చేశారు. అమ్మ ఒడి, విద్యా దీవెన, వసతి దీవెన, చేయూతతో పాటు ఒంటరి, వితంతు, దివ్యాంగ పింఛన్లు తీసేశారు. రాష్ట్రవ్యాప్తంగా 55,607 అంగన్వాడీ కేంద్రాలుంటే అందులో సుమారు 46,899 కేంద్రాలు గ్రామీణ ప్రాంతాల్లోనే ఉన్నాయి. ఇక్కడ పనిచేసే కార్యకర్తలకు సంక్షేమ పథకాల్లో కోత పడింది.అంగన్వాడీ కేంద్రాలకు వచ్చే గర్భిణీలు, బాలింతలు, పిల్లలకు నాణ్యమైన ఆహారం పెట్టాలని ఆదేశించే వైకాపా ప్రభుత్వం మెనూ చార్జీలు పెంచాలని అంగన్వాడీలు గగ్గోలు పెడుతున్న పట్టించుకోవడం లేదు. నిత్యవసరాల ధరలు రెట్టింపు అవుతున్నాయి లబ్ధిదారుల సంఖ్యను బట్టి సరాసరి ఒక్కో అంగన్వాడి కేంద్రానికి నెలకు రూ.1500-2000 వరకు వంట ఖర్చు వస్తుందని వారు చెబుతున్న ప్రభుత్వం పెడచెవిన పెడుతుంది. గ్యాస్ బండ భారము అంగన్వాడీ కార్యకర్తల పైనే వేస్తోంది. రోజుకు గర్భిణీలు, బాలింతలకు ఒక్కొక్కరికి రూ.1.75 పైసలు, 3-6 ఏళ్లలోపు చిన్నారులకు 50 పైసల చొప్పున ప్రభుత్వం గ్యాస్ వినియోగానికి చెల్లిస్తోంది. కొన్ని కేంద్రాల్లో కార్యకర్తలకు గ్యాస్ పై నెలకు రూ.500-800 వరకు చేతి నుంచి పడుతోంది.