ఆదిలాబాద్, సిరా న్యూస్
ఆదిలాబాద్ పట్టణంలోని మున్సిపల్ వార్డు హౌసింగ్ బోర్డు పరిధిలోని ఆదిత్యనగర్ కాలనీలోని సమస్యలు పరిష్కరించాలని సోమవారం ప్రజావాణిలో యువజన కాంగ్రెస్ నాయకులు కలెక్టర్ రాహుల్ రాజ్ కు వినతిపత్ం అందజేశారు. సుమారు ఐదు వేల జనాభా ఉన్న కాలనీలో కనీసం పాఠశాల కూడా లేదని అన్నారు. ప్రస్తుతం ఓ అద్దె భవనంలో నడుస్తున్న పాఠశాలకు పక్కా భవనం నిర్మించాలని కోరారు. ఐదు తరగతులకు ఇద్దరే ఉపాధ్యాయులు ఉన్నారన్నారు. పాఠశాలకు స్థలమున్నా నిర్మించడం లేదన్నారు. ప్రాథమిక విద్యను బలోపేతం చేయడానికి చర్యలు తీసుకోవడం లేదని వాపోయారు. కార్యక్రమంలో యువజన కాంగ్రెస్ అసెంబ్లీ ప్రధాన కార్యదర్శి సామ రూపేష్ రెడ్డి, యువజన కాంగ్రెస్ అసెంబ్లీ కార్యదర్శి నాగరాజు, మవల మండల అధ్యక్షుడు శేఖర్, ఉపసర్పంచ్ మల్లయ్య, రంజిత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.