Rajarshi Shah: కౌంటింగ్ కేంద్రాన్ని పరిశీలించిన జిల్లా క‌లెక్ట‌ర్‌ రాజర్షి షా

సిరాన్యూస్‌, ఆదిలాబాద్‌
కౌంటింగ్ కేంద్రాన్ని పరిశీలించిన జిల్లా క‌లెక్ట‌ర్‌ రాజర్షి షా

రానున్న లోక్ సభ ఎన్నికల సందర్భంగా స్థానిక టీటీడీసీ లో ఏర్పాటు చేసిన కౌంటింగ్ కేంద్రాన్ని బుధ‌వారం జిల్లా పాలనాధికారి రాజర్షి షా పరిశీలించారు. ఓట్ల లెక్కింపు, ఎన్నికల సామగ్రి పంపిణీ, పోలింగ్ ముగిసిన అనంతరం ఈవీఎంలను భద్రపరిచేందుకు స్ట్రాంగ్ రూమ్, మీడియా సెంటర్ ఏర్పాటు వసతులను పరిశీలించారు. అనంత‌రం అధికారులకు పలు సూచనలు చేశారు. రవాణా, పార్కింగ్ సదుపాయాలతో పాటు భద్రతా పరమైన అంశాలను నిశితంగా పరిశీలించి ఆన్ని ఏర్పాట్లను త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో ఆర్డీఓ వినోద్ కుమార్, ఎన్నికల సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *