Paidipelli Prithviraj Goud: రిజిస్ట్రేషన్ ఆఫీస్‌ను ప్రభుత్వ కార్యాలయానికి మార్చండి : పైడిపెల్లి పృథ్విరాజ్ గౌడ్

సిరా న్యూస్, భీమదేవరపల్లి
రిజిస్ట్రేషన్ ఆఫీస్‌ను ప్రభుత్వ కార్యాలయానికి మార్చండి : పైడిపెల్లి పృథ్విరాజ్ గౌడ్
* ఎంపీడీఓకి వినతి పత్రం అంద‌జేత

భీమదేవరపల్లి మండలం లోని రిజిస్ట్రేషన్ ఆఫీస్ ను ఖాళీగా ఉన్నా ప్రభుత్వ కార్యాలయం లోకి మార్చాలని బీజేపీ మండల అధ్యక్షులు పైడిపెల్లి పృథ్విరాజ్ గౌడ్ అన్నారు. సోమ‌వారం ఎంపీడీఓకు వినతి పత్రం అంద‌జేశారు. ఈసంద‌ర్బంగా ఆయ‌న మాట్లాడుతూ గత 1 సంవత్సరం నుండి సామాన్య ప్రజలు దోపిడీకి గురి అవుతున్నారన్నారు. పేద ప్రజల దగ్గర ఒరిజినల్ పత్రాలు లేకున్నా నకిలీ పత్రాలు సృష్టించి ప్రజల దగ్గర డబ్బులు విపరీతంగా తీసుకుంటున్నారని ఆరోపించారు. చదువురాని నిరక్ష్యరాస్యులు దగ్గర అధిక డబ్బులు తీసుకొని ఇబ్బందికి గురిచేస్తున్నారు. డాక్యూమెంట్ రైటర్ ఇష్ట రీతిలో వేల రూపాయలు దండుకుంటున్నారని తెలిపారు. తక్షణమే రిజిస్ట్రేషన్ ఆఫీస్ ప్రభుత్వ భవనం లోకి మార్చాల‌ని కోరారు.లేనిచో భారతీయ జనతా పార్టీ తరుపున పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తామ‌ని హెచ్చ‌రించారు. కార్యక్రమంలో ప్రధానకార్యదర్శులు గుండెల్లి సదానందం, శ్రీరామోజు శ్రీనివాస్, చీదురాల రమేష్, దొంగల వేణు, బైరి సదానందం, బొజ్జపురి పృథ్వీరాజ్, అలుగు భాస్కర్, కోదురుపాక అజయ్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *