సిరా న్యూస్ , బజార్ హత్నూర్
బొస్రా గ్రామములో బ్యాంక్ పథకాల పైన అవగాహన..
బజార్హత్నూర్ మండలంలోని బోస్రా గ్రామంలో తెలంగాణ గ్రామీణ బ్యాంక్ ఆధ్వర్యంలో నాబార్డ్ వారి సౌజన్యంతో ఆర్థిక అక్షరాస్యత అవగాహన కార్యక్రమం దేగామ బ్రాంచ్ మేనేజర్ మనోజ్ కుమార్, ఎంపీటీసీ సొంటకే గజానంద్ గ్రామ ప్రజలకు యమ్ వీ రూరల్ ఫోక్ ఆర్ట్ ఆర్గనైజేషన్ కళా బృందం వారిచే బ్యాంకులో ఉన్నటువంటి స్కీమ్స్, రుణాలు ముఖ్యంగా సామాజిక భద్రతా పథకాల గురించి జీవన జ్యోతి భీమా యోజన పథకం, అటల్ పెన్షన్ యోజన పథకం, ఇన్సూరెన్స్ లా పథకాల, గురించి మ్యాజిక్ షో ద్వారా మాటల ద్వారా పాటల ద్వారా ప్రజలకు అర్థమయ్యే రీతిలో తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ సొంటకే గజానంద్ మాట్లాడుతూ ; పొలాల్లో పని చేస్తున్నపుడు మనకు తెలియకుండా అనుకోని ప్రమాదలు జరుగుతూ ఉంటాయి. పాము కాటు, కరెంట్ షాక్, ప్రకృతి వైఫల్యంగా వర్షం పడేటప్పుడు పిడుగు పడి కొందరు చనిపోతూ ఉంటారు. వారికి ఇంటి పెద్దగాఉన్న వారిని కోల్పోయినప్పుడు ఆ ఇంటి మీద పెద్ద భారము ఉంటుంది. కాబట్టి 20 రూపాయలకు రెండు లక్షల బీమా మరియు 436 రూపాలు రెండు లక్షల న్యాచురల్ బీమా చేసుకుంటే కుటుంబానికి భద్రత ఉంటుందిఅని అన్నారు.ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు పాల్గొన్నారు.