సిరాన్యూస్,సిరికొండ
పొన్న గ్రామాన్ని సందర్శించిన కలెక్టర్ రాజర్షి షా
స్వచ్చదనం పచ్చదనం కార్యక్రమం లో భాగంగా మంగళవారం రెండవ రోజు ఆదిలాబాద్ జిల్లా సిరికొండ మండలం పొన్న గ్రామాన్ని జిల్లా పాలనాధికారి రాజర్షి షా సందర్శించారు.అనంతరం ప్రాథమిక పాఠశాలలో మొక్కలు నాటి, మిషన్ భగీరథ నీటి పై చర్చించి, ఓ ఇంటిలో నీటిని పరీక్షించి, డ్యామేజ్ అయిన రోడ్డును, బ్రిడ్జి ని పరిశీలించారు.స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంలో భాగంగా పొన్న గ్రామాన్ని సందర్శించి గ్రామంలో ఉన్నఓహెచ్ఎస్ఆర్ ట్యాంక్ వద్ద పరిసరాలను, నీటి నాణ్యత పరీక్షలను, వాటికి సంబంధించిన రికార్డులను పరిశీలించారు. అనంతరం గ్రామంలోని ఓ ఇంటిలో నీటి నాణ్యత ను ద్వారా పరిశీలించారు. ఏఈ ఆర్డబ్ల్యూస్ ను నీటి సరఫరా గురించి అడిగి తెలుసుకున్నారు. వర్షం వలన దెబ్బతిన్న రోడ్లు లను పరిశీలించారు.ఈ కార్యక్రమంలో డీఎల్పీఓ , ఎంపీడీఓ ,పంచాయతీ కార్యదర్శి , గ్రామ ప్రజలు పాల్గొన్నారు.