క్వాడ్జ్ గ్రామంలో సోమిరెడ్డి గ్రామనిద్రSomireddy Gramanidra in Kwadge village

సిరా న్యూస్,నెల్లూరు;
కెజిఫ్ ను తలపించే విధంగా మైన్స్ మాఫియా ఏదేచిగా రెచ్చిపోతుంది. కోర్టుల ఆర్డర్లను సైతం బెకారత్తు చేయకుండా అక్రమ మైనింగ్ చేస్తున్నారు. నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం అనేక గ్రామాల్లోజరుగుతున్న అక్రమ క్వాడ్జ్ మాఫియా పై మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గ్రామములోని నిద్రించి సత్యాగ్రహ దీక్ష చేపట్టారు. మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి స్వగ్రామం పక్కనే రోజుకి 2 నుండి 4 కోట్లరూపాయల విలువచేసే క్వాడ్జ్ స్టోన్ ను అక్రమింగా తరలిస్తున్నారని సోమిరెడ్డి ఆరోపించారు. ఎలాంటి భద్రతా చర్యలు చేపట్టకుండా బ్లాస్టింగ్ చేపట్టడంతో పరిసర ప్రాంతాల్లోనే గిరిజనులు భయభ్రాంతులకుగురవుతున్నారన్నారు. కే జి ఎఫ్ ను తలపిస్తున్న కాకాణి గోవర్ధన్ ఫ్యాక్టరీ లో వైయస్ భారతీ రెడ్డి విజయ సాయి రెడ్డి వాటాలకు పోను కోట్ల రూపాయలు సామంత రాజులు దోచుకుంటున్నారనివిమర్శించారు. అక్రమ మైనింగ్ ఆపే వరకు దీక్ష కొనసాగిస్తానన్నారు. సోమిరెడ్డి దీక్షకు మద్దతుగా నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, గూడూరు మాజీ ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్,తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి, టిడిపి అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డి, టిడిపి నాయకులు మస్తాన్ యాదవ్ మరియు తెలుగుదేశం పార్టీ నాయకులుకార్యకర్తలు సోమిరెడ్డికి మద్దతు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *