సిరాన్యూస్, ఆదిలాబాద్
ఆదిలాబాద్ గ్రంథాలయాన్ని సందర్శించిన కలెక్టర్ రాజర్షి షా
జిల్లా గ్రంథాలయంలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజర్షి షా అన్నారు. మంగళవారం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని గ్రంథాలయాన్ని సందర్శించారు. ఈ సందర్బంగా గ్రంధాలయం లోని అన్ని విభాగాలతో పాటు వాష్ రూమ్లను కూడా తనిఖీ చేసారు. అనంతరం పాఠకులతో కలిసి వారి సమస్యలను తెలుసుకున్నారు. ఈ గ్రంథాలయంలో పాఠకులకు అవసరమైన సౌకర్యాలను, భవన మరమ్మత్తులను చేపడతామని అన్నారు. ఎక్కువ మంది అభ్యర్థులు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించాలని ఆయన ఆకాంక్షించారు. గ్రంథాలయమునకు నూతన భవన నిర్మాణానికి సాధ్యమైనంత త్వరగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. గ్రంథాలయంలో అన్ని విభాగాలను ఆవరణను పరిశీలించి శుభ్రంగా ఉంచాలని గ్రంథాలయ సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు.గ్రంథాలయంలో పాఠకులకు కావలసిన అన్ని పత్రికలను, దినపత్రికలను అందుబాటులో ఉంచాలని ఆదేశించారు.