సిరా న్యూస్, హైదరాబాద్:
రాష్ట్రపతికి స్వాగతం పలికిన ఎమ్మెల్యే పాయల్ శంకర్
శీతాకాలం విడిది కోసం హైదరబాద్కు విచ్చేసిన రాష్ట్రపతి ద్రౌపతి ముర్మును ఆదిలాబాద్ ఎమ్మెలే పాయల్ శంకర్ మర్యాద పూర్వకంగా కలుసుకున్నారు. సోమవారం ప్రత్యేక విమానంలో బేగంపేట్ ఎయిర్పోర్ట్కు చేరుకున్న రాష్ట్రపతిని గవర్నర్ తమిళిసై, సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఇతర మంత్రులు స్వాగతం పలికారు. కాగా ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ సైతం రాష్ట్రపతిని కలిసి స్వాగతం పలికారు. మర్యాదపూర్వకంగా రెండు చేతులు జోడించి రాష్ట్రపతికి అభివాదం తెలిపారు.