సిరాన్యూస్, జైనథ్
పెన్గంగా నదిని పరిశీలించిన కలెక్టర్ రాజర్షి షా
భారీ వర్షాలు కురుస్తుండడంతో ఆదిలాబాద్ – మహారాష్ట్ర సరిహద్దున ఉన్న పెన్గంగా నదికి వరద నీరు వచ్చి చేరుతుంది. ఈ నేపథ్యంలో సోమవారం ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలంలోని పెన్ గంగా నదిని ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజర్షి షా, జిల్లా ఎస్పీ గౌస్ ఆలం పరిశీలించారు.అనంతరం కలెక్టర్, ఎస్పీలు కామాయి గ్రామానికి నిలిచిన రాకపోకల సందర్భంగా ఆ గ్రామ మాజీ సర్పంచ్ తో ఫోన్ లో మాట్లాడి వివరాలను అడిగి తెలుసుకున్నారు.భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అత్యవసరం ఉంటేనే బయటకు రావాలని తెలిపారు. చెరువులు, వంతెనల వద్దకు ప్రజలు వెళ్లవద్దని తెలిపారు.