మహిళా డిగ్రీ కళాశాల ఏర్పాటుకు కృషి
ఉపాధ్యాయుల కృషి ఫలితంగానే మెరుగైన ఫలితాలు*
విద్యాలయాల్లో మౌలిక వసతుల కల్పన
ఉత్తమ సేవలు అందించిన 42 మంది ఉపాధ్యాయులకు సన్మానం
పెద్దపెల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు.
సిరా న్యూస్,పెద్దపల్లి ప్రతినిధి;
విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకమని పెద్దపెల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు అన్నారు.గురువారం సమీకృత జిల్లా కలెక్టరేట్ లో జాతీయ ఉపాధ్యాయుల దినోత్సవం పురస్కరించుకొని ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పెద్దపెల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు, రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ , జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష , స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జె అరుణ శ్రీ , అదనపు కలెక్టర్ రెవెన్యూ జి శ్యాంప్రసాద్ లాల్ లతో కలిసి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి పూలమాలవేసి జ్యోతి ప్రజ్వలన గావించి కార్యక్రమం ప్రారంభించారు.ఈ సందర్భంగా కార్యక్రమం ముఖ్యఅతిథిగా విచ్చేసిన ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు మాట్లాడుతూ తాను ఇంతగా ఎదగడానికి గురువులు నేర్పిన విద్యాబుద్ధుల కారణమని వారికి ఎల్లప్పుడూ రుణపడి ఉంటానని అన్నారు.ఉపాధ్యాయ వృత్తి నుంచి రాష్ట్రపతి హోదా వరకు ఎదిగిన సర్వేపల్లి రాధాకృష్ణన్ జన్మదినం పురస్కరించుకొని ఉపాధ్యాయ దినోత్సవం నిర్వహించుకుంటున్నామని, మారుమూల ప్రాంతాల్లో విద్యార్థు తీర్చిదిద్దిన ఉపాధ్యాయులను గుర్తించి వారిని సన్మానించడం తన అదృష్టంగా భావిస్తున్నానని తెలిపారు. ఉపాధ్యాయ అవార్డు వచ్చిన ఉపాధ్యాయు లను ఆదర్శంగా తీసుకొని ముందుకు వెళ్లాలని అన్నారు. ఉపాధ్యాయులు ఈ పాఠశాల నాది ఈ విద్యార్థులు నా వారు అన్న భావనతో పనిచేసినప్పు డు విద్యార్థుల భవిష్యత్తు మెరుగుపడుతుందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతుల కల్పనకు 12 వందల కోట్ల రూపాయలు వెచ్చిచ్చిందని అన్నారు. ప్రభుత్వం అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నందున బాధ్యతాయుతంగా పనిచే యాలని ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య మెరుగుపరి చే విధంగా చర్యలు చేపట్టాలని పాఠశాలలో ఎలాంటి అవసరాలు ఉన్న ప్రభుత్వ దృష్టికి తీసుకురావాలని వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని అన్నారు.సింగరేణి ద్వారా జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు వచ్చే విద్యా సంవత్సరానికి నోట్ బుక్స్ అందించడం జరుగుతుందని అన్నారు. మహిళ ప్రభుత్వ జూనియర్ కళాశాలను రెండు కోట్ల రూపాయలతో మరమ్మత్తులు చేయడం జరుగుతుందని అదేవిధంగా జిల్లా కేంద్రంలో మహిళా డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయడానికి ప్రయత్నం చేస్తున్నామని పెద్దపెల్లి ఎమ్మెల్యే తెలిపారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష మాట్లాడుతూ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు తీసుకుంటున్న ఉపాధ్యాయు లకు మరియు జిల్లాలో పనిచే స్తున్న ఉపాధ్యాయుల అందరికి ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా అభినందించారు, మన జిల్లాలో ఉపాధ్యాయులు చాలా బాగా పనిచేస్తున్నారని అదేవిధంగా మునుముందు కూడా ఇలానే పనిచేయాలని కోరారు జిల్లా యంత్రాంగం ద్వారా పాఠశాలకు కావలసిన మౌలిక వసతులు కల్పించగలము కానీ విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దడం ఉపాధ్యాయుల చేతుల్లోనే ఉందని ప్రతి విద్యార్థి పై ప్రత్యేక శ్రద్ధ వయస్సు వారి విద్యా సామర్థ్యాలు మెరుగుపరి చేందుకు ఉపాధ్యాయులు కృషి చేస్తున్న తీరు ప్రశంసనీయమని అన్నారు.ఉపాధ్యాయులు తమ వృత్తిలో రాణించాలంటే వృత్తిపట్ల శ్రద్ధ విద్యార్థులకు సులువుగా వేసే విధంగా విద్యాబోధన చేయాలని,
విద్యార్థులకు చిన్న వయసు నుంచి మంచి అలవాట్లు నేర్పించాలని, నూతన విధానంలో విద్యాబోధన చేయాలని, చదువుతోపాటు క్రీడల్లో సైతం విద్యార్థులు పాల్గొనే దిశగా ఉపాధ్యాయులు ప్రోత్సహించాలని రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ అన్నారు. అనంతరం ఉత్తమ ప్రతిభ కనబరిచిన 42 మంది ఉపాధ్యాయులకు ముఖ్య అతిధులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో డి . సి.ఇ.బి కార్యదర్శి వి. హనుమంతు ఎ.సి.జి.ఇ ఎం. రామ్ రెడ్డి సమగ్ర శిక్ష సమన్వయకర్త పి. ఎం. షేక్, ఉపాధ్యాయ సంఘం నాయకులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.