సెల్ఫీ వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టిన బాధితుడు.
సిరా న్యూస్,యాదాద్రి భువనగిరి;
భువనగిరి మండలం, బండ సోమవారం గ్రామానికి చెందిన “చెరుకూరి ప్రసాద్”.. ఆన్లైన్ గేమ్ లకు బానిస అయ్యాడు. తాతలనాటి ఆస్తి ఎకరం పొలం అమ్మగా డబ్బులు రాగా.. ఆ డబ్బులతో వ్యాపారం చేసుకుని భూమి కొనుక్కోవాలి అనుకున్న అతనికి.. ఆన్లైన్ గేమ్ వ్యసనంగా మారింది. దీంతో.. డబ్బులు అన్ని ఆన్ లైన్ గేమ్ లో పోగొట్టుకున్నాడు. చివరకు తన చావుకు కారణం తండ్రి అని.. సెల్ఫీ వీడియో రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పెట్టారు. విషయం తెలుసుకున్న తండ్రి భువనగిరి రూరల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఇంతవరకు ఆన్లైన్ గేమ్ కు బానిసైన ప్రసాద్ ఆచూకీ లభించలేదు.