సిరాన్యూస్, బేల
సర్వే నివేదికలు పంపాలి : కలెక్టర్ రాజర్షి షా
సాంగిడీ గ్రామాన్ని సందర్శన
ప్రతి యొక్క పంట పొలాలలో నష్టవాటిల్లితే అక్కడ సర్వే నిర్వహించి అధికారులకు, ప్రభుత్వానికి నివేదిక పంపాలని ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజర్షి షా అన్నారు. మంగళవారం ఆదిలాబాద్ జిల్లా బేల మండలం సాంగిడి గ్రామాన్ని అనుకొని ఉన్న పెన్ గంగా పరివాహక ప్రాంతాలైన సాంగిడి, భేదొడా, గూడా, తది తర ప్రాంతంలో వరద నీరు చేరడంతో కలెక్టర్ రాజర్షి షా పరిశీలించారు. ఈసందర్బంగా కలెక్టర్ పలు వ్యవసాయ క్షేత్రాలలో పంట పొలాల్లో చూసి రైతులని అడిగి పంట ఎంత నష్ట వాటిల్లింది అని అడిగి తెలుసుకున్నారు . సత్వరమే వ్యవసాయ అధికారులను పిలిచి సర్వే నిర్వహించి పంట ఎంత నష్టం వాటిల్లింది తెలుసుకున్నారు. ప్రతి యొక్క పంట పొలాలలో నష్టవాటిల్లితే అక్కడ సర్వే నిర్వహించి అధికారులకు ప్రభుత్వానికి నివేదిక పంపాలన్నారు. కొన్ని వ్యవసాయ క్షేత్రంలో ఆయిల్ ఫామ్ సాగును పరిశీలించారు. రైతులకు పూర్తి పంట నష్టం ప్రభుత్వానికి నివేదిక ఇస్తామని అన్నారు. అలాగే సాంగిడీ గ్రామన్ని అనుకొని ఉన్న ఉమ్రీ బిడ్జిని పరిశీలించారు. గ్రామంలో ఎప్పటికప్పుడు స్వచ్ఛదనం పచ్చదనం పరిశుభ్రత పాటించాలని అన్నారు. అవాసాల్లో మురికి నీరు నిల్వ ఉండా కుండా తగు జాగ్రత్తలను తీసుకోవాలని అన్నారు. సమాచారం సేకరించి పై అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో డీపీఆర్ తిరుమల, మండల తహసీల్దార్ వామన్, మండల ప్రజా పరిషత్ అధికారి.నేర్ల మహేందర్, వ్యవసాయ అధికారి వినయ్ కుమార్, గ్రామ కార్యదర్శి గౌతమ్,ఎంపిఓ వినోద్ కుమార్, గ్రామస్తులు గోపతి నాగేష్, కన్నల గంగన్న, గోపతి చంద్రకాంత్ పాల్గొన్నారు.