MP Nagesh: ఉపాధ్యాయుల చేతుల్లోనే విద్యార్థుల భ‌విష్య‌త్తు : ఎంపీ న‌గేష్‌

సిరాన్యూస్‌, బోథ్‌
ఉపాధ్యాయుల చేతుల్లోనే విద్యార్థుల భ‌విష్య‌త్తు : ఎంపీ న‌గేష్‌
* అవార్డు గ్ర‌హీత దశరథ్‌కు ఘ‌న స‌న్మానం

ఉపాధ్యాయుల చేతుల్లోనే విద్యార్థుల భ‌విష్య‌త్తు ఉంటుంద‌ని ఎంపీ న‌గేష్ న‌గేష్ అన్నారు. ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండలంలోని సోనాల గ్రామానికి చెందిన కచ్చకాయల దశరథ్ ఉత్తమ ఉపాధ్యాయుడిగా అవార్డు అందుకున్నారు. బుధ‌వారం సొనాల గ్రామంలో అవార్డు గ్ర‌హీత దశరథ్‌ను ఆదిలాబాద్ జిల్లా పార్లమెంట్ సభ్యుడు గెడం నగేష్ స‌న్మానించారు. ఈసంద‌ర్బంగా ఎంపీ న‌గేష్ మాట్లాడుతూ ఎంతో మంది విద్యార్థుల భవిష్యత్తు ఉపాధ్యాయుల చేతుల్లో ఉంధి అని, అలాంటి గొప్ప వృత్తిలో ఉంటూ ఉత్తమ ఉపాధ్యాయుడిగా అవార్డు పొందడం అభినందనీయమని  అన్నారు. ఈకార్యక్రమంలో సుభాష్ సూర్య, బోరే రవీందర్, చెట్ల పెల్లి రవికాంత్ కాని మురళీధర్, భాషెట్టి రమేష్, రాజేశ్వర్, కచ్చకాయల హరీష్,పోతన్న,రంజిత్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *