సిరా న్యూస్, రాజన్న సిరిసిల్ల:
ఆడపిల్లలు ఆత్మ స్థైర్యం తో ముందుకు సాగాలిజడ్పీ చైర్ పర్సన్ న్యాలకొండ అరుణ రాఘవరెడ్డి…
ఆడపిల్లలు ఆత్మ స్థైర్యం తో ముందుకు సాగాలని జడ్పీ చైర్ పర్సన్ న్యాలకొండ అరుణ రాఘవరెడ్డి అన్నారు. జిల్లా కేంద్రం లోని మినీ స్టేడియంలో కేజీబీవీ విద్యార్థినిలకు జిల్లాస్థాయి గేమ్స్, స్పోర్ట్స్ ,కార్యక్రమాన్ని జిల్లా విద్యాధికారి రమేష్ కుమార్, జిల్లా సంక్షేమ అధికారి లక్ష్మీరాజంలతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా జడ్పీ చైర్పర్సన్ మాట్లాడుతూ క్రీడలు పిల్లల శారీరక, మానసిక అభివృద్ధికి తోడ్పడతాయని, విద్యార్థులు చదువుతోపాటు ఆటల్లో కూడా రాణించాలని, విద్యార్థులు జిల్లా స్థాయి నుంచి రాష్ట్రస్థాయికి తద్వారా జాతీయ స్థాయికి ఎదగాలని సూచించారు. ఈ కార్యక్రమం లో మున్సిపల్ చైర్మ న్ జిందం కళాచక్రపాణి , వార్డు కౌన్సిలర్ రేపల్లి అరుణ లక్ష్మీనారాయణ, డివైఎస్ఓ అజ్మీరా రామదాసు, జెండర్ అండ్ ఈక్విటీ కోఆర్డినేటర్ పద్మజ , మహిళా సాధికారత కేంద్రం కోఆర్డినేటర్ రోజా, ఎస్జీఎఫ్ సెక్రటరీ దేవత ప్రభాకర్, వ్యాయామ ఉపాధ్యా యులు, కేజీబీవీ విద్యార్థినిలు తదితరులు పాల్గొన్నారు.