జిల్లా అభివృద్దికి నిధులివ్వండి

కంపెనీ ప్రతినిధులతో మంత్రి దామోదర రాజనర్సింహ
సిరా న్యూస్,సంగారెడ్డి;
రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ సంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లా లో ఉన్న అతి పెద్ద, పెద్ద & మధ్య స్థాయి కంపెనీల ప్రతినిధులతో ఏర్పాటు చేసిన సమీక్షా సమావేశం లో జిల్లా క్రాంతి వల్లూరురితో కలిసి పాల్గోన్నారు. సంగారెడ్డి జిల్లా లో సామాజిక, విద్యా , వైద్య రంగాల అభివృద్ధికి సీఎస్సార్ ఫండ్స్ కేటాయింపుల పై చర్చ జరిపారు. జిల్లాలో ఉన్న కంపెనీ లు జిల్లా అభివృద్ధికి సీఎస్సార్ ఫండ్స్ ను తమవంతు భాధ్యత గా జిల్లా అభివృద్ది కి 2 శాతం ఫండ్స్ ను విడుదల చేయాలని మంత్రి దామోదర్ రాజనర్సింహ కంపెనీ ప్రతినిధులకు, యాజమాన్యాలకు సూచించారు. గతంలో సీఎస్సార్R ఫండ్స్ తో చేపట్టిన పనులను వెంటనే పూర్తి అయ్యేలా కంపెనీ ప్రతినిధులు చొరవ చూపాలన్నారు. ఈ కార్యక్రమంలో సంగారెడ్డి జిల్లా సంబంధిత శాఖ ప్రభుత్వ అధికారులు, వివిధ కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *