MLA Payal Shankar: కులవృత్తులను ఆదుకోవడం కోస‌మే ప్రధానమంత్రి విశ్వకర్మ పథకం : ఎమ్మెల్యే పాయల్ శంకర్

సిరాన్యూస్,ఉట్నూర్
కులవృత్తులను ఆదుకోవడం కోస‌మే ప్రధానమంత్రి విశ్వకర్మ పథకం : ఎమ్మెల్యే పాయల్ శంకర్
ఉట్నూర్‌లో పీఎం విశ్వకర్మ తొలి వార్షికోత్సవ వేడుకలు

ప్రధాని నరేంద్ర మోడీ గొప్ప ఆలోచనతో ప్రధానమంత్రి విశ్వకర్మ పథకాన్ని ప్రవేశపెట్టి కులవృత్తులను ఆదుకోవడం జరుగుతుందని ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ పేర్కొన్నారు. శుక్రవారం ఉట్నూర్ మండల కేంద్రంలోని పిఎంఆర్సి సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన పీఎం విశ్వకర్మ తొలి వార్షికోత్సవ వేడుకలు పాల్గొని మాట్లాడారు. అంతకుముందు కులవృత్తులు తయారుచేసిన వస్తువులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కులవృత్తిదారులు ఆధునిక యుగానికి అనుగుణంగా ముందుకు వెళ్లాలన్నారు. లబ్ధిదారులు నేరుగా పీఎం విశ్వకర్మ పథకానికి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్న తర్వాత వారిని గుర్తించి, ఆ యొక్క లబ్ధిదారుకి శిక్షణ ఇచ్చి కావలసిన వంటి సహకారాన్ని పూర్తిగా బ్యాంకుల ద్వారా అందించి, వాళ్ల కాళ్ల మీద నిలబడే విధంగా చేయడమే ఈ పథకం ఉద్దేశమని వారు పేర్కొన్నారు. పీఎం విశ్వకర్మ పథకం అర్హులైన నిరుపేదలకు అందేలా అధికారులు సైతం చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రతి ఒక్కరు సైతం స్వయం ఉపాధి పెంపొందించుకోవాలని పేర్కొన్నారు. అంత‌రం పీఎం పర్చూవల్ కార్యక్రమంలో ఎంపీ జి. నగేష్ ఎమ్మెల్యే బొజ్జు పటిల్ పాల్గొన్నారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాజ‌ర్షి షా, ఎస్పీ తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *