సిరాన్యూస్, ఆదిలాబాద్
కుంటాల జలపాతం విహారయాత్ర ప్రారంభించిన కలెక్టర్ రాజర్షి షా
ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని పురస్కరించుకుని పర్యాటక శాఖ ఆధ్వర్యంలో ప్రభుత్వ , కేజిబివి, పాఠశాలల విద్యార్థులకు చిత్రలేఖనం, వ్యాసరచన పోటీలు, ఉపన్యాసాలు నిర్వహించారు. ఈ సందర్భంగా విజేతలుగా నిలిచిన విద్యార్థులు కుంటాల జలపాతం విహారయాత్రకు శుక్రవారం బయలుదేరుతున్న సందర్భంగా జిల్లా పాలనాధికారి రాజర్షి షా జెండా ఊపి ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో పర్యాటక శాఖ అధికారి రవికుమార్, డీఈఓ ప్రణీత, ఏఎస్ఓ శ్రీహరి బాబు, తదితరులు ఉన్నారు.