సిరా న్యూస్,కామారెడ్డి;
కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం సర్వసభ్య సమావేశంలొ రైతులు ఆందోళన చేశారు. రైతులు చైర్మన్ గాంధీ, కార్యదర్శి విఠల్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ రాజీనామాచెయ్యాలని డిమాండ్ చేశారు. కొంత సేపు ఘర్షణ వాతావరణం నెలకొంది. చైర్మన్, కార్యదర్శి రైస్ మిల్లర్ల తొ కుమ్మక్కై ధాన్యం కొనుగోలు లో అవినీతికి పాల్పడ్డరని రైతులు ఆరోపించారు.