సిరా న్యూస్, ఓదెల
నేత్రదాత సమ్మయ్య : సదాశయ ఫౌండేషన్ జాతీయ కార్యదర్శి భీష్మాచారి
* అభినందనలు తెలిపిన సదాశయ ఫౌండేషన్ ప్రతినిధులు
పెద్దపల్లి జిల్లా ఓదెల గ్రామానికి చెందిన బుధవారం ముద్దసాని సమ్మయ్య అనారోగ్యంతో మృతి చెందారు. సదాశయ ఫౌండేషన్ జాతీయ కార్యదర్శి భీష్మాచారి వారి సమీప బంధువు బోడకుంట.శంకర్ నేత్రదానం గురించి కుటుంబ సభ్యులకు అవగాహన కల్పించారు. దీంతో వారు ఒప్పుకోవడంతో ఎల్విపి టెక్నీషియన్ గాజుల సతీష్ సహకారంతో కార్నియాలు సేకరించి హైదరాబాద్ ఐ బ్యాంక్ పంపించారు. ఇద్దరు అంధులకు చూపును ప్రసాదించిన తల్లి రాజమ్మ భార్య స్వరూప సహకరించిన తీర్థాల కుమారు గొర్ల శ్రీనివాస్ లకు సదాశయ ఫౌండేషన్ జాతీయ అధ్యక్షులు శ్రవణ్ కుమార్, ప్రధాన కార్యదర్శి లింగమూర్తి, జాతీయ కార్యదర్శి డాక్టర్ భీష్మాచారి, అధ్యక్షులు సానా రామకృష్ణా రెడ్డి, సలహాదారులు నూక రమేష్, రాష్ట్ర ప్రచార కార్యదర్శి వాసు, చంద్రమౌళి ,పృథ్విరాజ్ అభినందనలు ధన్యవాదాలు తెలిపారు.