సిరాన్యూస్, ఓదెల
శ్రీహరినాథ్కు ఎల్ఓసీ చెక్కు అందజేసిన ఎమ్మెల్యే విజయరమణ రావు
పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలంలోని సుల్తాన్ పూర్ గ్రామానికి చెందిన శ్రీహరినాథ్ అనారోగ్యం కారణంగా హైదరాబాద్ లోని నిమ్స్ హాస్పిటల్లో చేరారు. శ్రీహరినాథ్ కి ఆసుపత్రి ఖర్చుల నిమిత్తం ముందస్తుగా ముఖ్యమంత్రి సహాయ నిది నుండి మంజూరైన రూ.75,000/- ఎల్ ఓసి చెక్కును గురువారంశివపల్లి గ్రామంలోని తన నివాసంలో వారి కుటుంబ సభ్యులకు పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయరమణ రావు అందజేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.