సిరాన్యూస్, ఓదెల
గోలి చిన్న చంద్రయ్య కుటుంబానికి ప్రశంస పత్రం అందజేత : సదాశివ సేవా ఫౌండేషన్
పెద్దపల్లి జిల్లా శ్రీరాంపూర్ మండల కేంద్రానికి చెందిన గోలి చిన్న చంద్రయ్య గత పది రోజుల క్రితం మృతి చెందారు. వారి నేత్రాలను సదాశివ సేవా ఫౌండేషన్కు దానం చేశారు. శనివారం గోలి చిన్న చంద్రయ్య దశ దినకర్మ సందర్భంగా సదాశివ సేవా ఫౌండేషన్ సభ్యులు చంద్రయ్య కుటుంబానికి ప్రశంస పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ ఎంపీపీ గోపగాని సారయ్య గౌడ్, తహసీల్దార్ ఎ వకీల్, డిప్యూటీ ఎమ్మార్వో శంకర్, శ్రీరాంపూర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గజవేనా సదయ్య యాదవ్ హాజరయ్యారు. ఈసందర్బంగా గోలి చిన్న చంద్రయ్య ఆత్మకు శాంతి చేకూరాలని ఒక నిమిషం పాటు మౌనం పాటించారు. అనంతరం మాజీ ఎంపీపీ సారయ్య గౌడ్ మాట్లాడుతూ వారి యొక్క ఈ యొక్క నేత్రాలు దానం చేయడం వల్ల రెండు కుటుంబాలు ఈరోజు ప్రపంచాన్ని చూడగలుగుతున్నాయని అన్నారు. ఇలాంటి పెద్ద మనసుతో ప్రతి ఒక్కరు కూడా వారి యొక్క మరణానంతరం కండ్లను దానం చేస్తే బాగుంటుందని తెలిపారు.కార్యక్రమంలో మాజీ సర్పంచ్ మదాసి సతీష్, సబ్బని రాజమల్లు, అల్లంల దేవేందర్, రాంచేంద్రారెడ్డి , కార్యకర్తలు, కుటుంబ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.