సిరా న్యూస్,కాకినాడ;
జిల్లాలో తొమ్మిది మంది ఎస్సై లను బదిలీ చేస్తూ ఎస్పీ సతీష్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. వీఆర్లో ఉన్న ఎంవీవీ రవీంద్రబాబు కాకినాడ వన్ టౌన్ ఎస్సైగా నియమితులయ్యారు. అక్కడ పని చేస్తున్నశోభన్ బాబును పెదపూడి బదిలీ చేశారు. పెదపూడిలో పని చేస్తున్న రామారావు కరప బదిలీ అయ్యారు. కరప ఎస్సైగా ఉన్న ఎన్. రామకృష్ణను గండేపల్లిలో నియమించారు. అక్కడ పని చేస్తున్న వై.గణేష్కుమార్ ను కాకినాడలో వీఆర్లో ఉంచారు. వీఆర్ ఉన్న ఎ.బాలాజీకి గొల్లప్రోలులో పోస్టింగ్ లభించింది. ఆ స్థానంలో పని చేస్తున్న వినయ్ ప్రతాప్ ను కాకినాడలో వీఆర్లో ఉంచారు. సర్పవరంలో పని చేస్తున్నవి.మౌనిక సామర్లకోటకు, ఎన్. సతీష్ బాబు పెద్దాపురానికి బదిలీపై వెళ్లనున్నారు .