ప్రమాద భరితంగా జాతీయ రహదారి

సిరా న్యూస్,కాకినాడ;
కాకినాడ జిల్లా పిఠాపురం నియోజవర్గం గొల్లప్రోలు 216 జాతీయ రహదారి పూర్తిగా జలమయమయింది. దీంతో వాహన చోదకులు, ఆటోవాలాలే కాదు భారీ వాహనాల డ్రైవర్లు కూడా ఇబ్బందులు పడుతున్నారు. 216జాతీయ రహదారిపై గొల్లప్రోలు వద్ద ఏర్పాటు చేసిన టోల్ గేట్ వద్ద మూడు అడుగుల కిపైగా నీరు ప్రవహిస్తోంది. అత్యంత ప్రమాదభరితంగా ఇక్కడ పరిస్థితి ఉంది. దీంతో పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు .భయం భయంగా వాహనాలు నడుపుతున్నారు. ఏ క్షణంలో ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *