సిరా న్యూస్,హైదరాబాద్;
ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించడం వల్ల తీవ్రంగా నష్టపోతున్నామని తెలంగాణ స్టేట్ ఆటో అండ్ టాక్సీ డ్రైవర్స్ యూనియన్ నేతలు ఆరోపించారు. వెంటనే ఆటో డ్రైవర్లు ఉపాధిని రాష్ట్ర ప్రభుత్వం కాపాడాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్ బస్ భవన్ ముందు ల్ గ్రేటర్ హైదరాబాద్ ఆటో, టాక్సీ డ్రైవర్స్ యూనియన్ ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా బిఎమ్ఎస్ జాతీయ నాయకుడు రవిశంకర్ మాట్లాడుతూ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ద్వారా తాము నష్ట పోతున్నామని అన్నారు.ఓలా, ఉబర్ , రాపిడ్ బైక్ ల అక్రమ వ్యాపారం వల్ల ఆటో డ్రైవర్స్ తీవ్రంగా నష్టపోయి రోడ్డున పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే ప్రభుత్వ తీరు మార్చుకొని మహాలక్ష్మి పథకం సవరించి…,ఆటో డ్రైవర్ల కి ఉపాధి కల్పించాలని డిమాండ్ చేశారు.