సిరా న్యూస్,హైదరాబాద్;
నిజాం కాలేజీలో డిగ్రీ విద్యార్థిని లకు 100 శాతం హాస్టల్ కేటాయించాలని గత ఐదు రోజుల నుండి నిరసన కార్యక్రమం కొనసాగుతోంది. చీకటైనా కూడా విద్యార్థులు నిరసన విరమించకుంగా కాలేజీలో బైటాయించారు. కాలేజీ ప్రిన్సిపాల్ తమ ప్రతిపాదనను పట్టించుకోకుండా డిగ్రీ విద్యార్థిని లకు 50% , పీజీ విద్యార్థిని లకు 50% కేటాయిస్తామని సర్కులర్ విడుదల చేయడాన్ని వ్యతిరేకించారు. పీజీ లకు ఉస్మానియా యూనివర్సిటీ లో హాస్టల్ సౌకర్యం ఉందంటున్న డిగ్రీ విద్యార్థులు, తమ హాస్టల్ తమకే 100% విద్యార్థులకు కేటాయించాలని డిమాండ్ చేస్తున్నారు.