సిరాన్యూస్, బోథ్
ఆధ్యాత్మికతో మానసిక ప్రశాంతత : ఎమ్మెల్యే అనిల్ జాదవ్
* చింతలబోరిలో అఖండ హరినామ సప్త
ఆధ్యాత్మికతో మానసిక ప్రశాంతత లభిస్తుందని బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ అన్నారు. ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండలంలోని చింతల బోరి గ్రామంలో మంగళవారం నిర్వహించిన అఖండ హరినామ సప్త కార్యక్రమంలో శాసనసభ్యులు జాదవ్ అనిల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆధ్యాత్మికత కార్యక్రమాల వల్ల మానసిక ప్రశాంతత నెలకొంటుంది అన్నారు. ప్రజలు సన్మార్గంలో నడవడానికి ఆధ్యాత్మికత కార్యక్రమాలు అవసరమని పేర్కొన్నారు. కార్యక్రమంలో గ్రామ నాయకులు ముందే వినోద్, కేంద్రీ ఈశ్వర్, సంతోష్ తో పాటు ఎంపీపీ తుల శ్రీనివాస్, సర్పంచ్ల సంఘం అధ్యక్షులు శ్రీధర్ రెడ్డి , మాజీ సర్పంచ్ సురేందర్ యాదవ్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ రఘుమన్సింగ్, తదితరులు పాల్గొన్నారు.