సిరాన్యూస్ ,ఖానాపూర్
వైద్యం వికటించి బాలిక ఆన్కార్ ఉత్తర మృతి
వైద్యం వికటించి బాలిక మృతి చెందిన సంఘటన నిర్మల్ జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి.. నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలోని శాంతినగర్ కు చెందిన ఆన్ కార్ ఉత్తర (12) బాలికకు ఆరోగ్యం బాగాలేక నిర్మల్ న్యూరో హాస్పిటల్ లో గత మూడు రోజుల క్రితం చేర్పించారు. అప్పటినుండి డాక్టర్ సలహా మేరకు ట్రీట్మెంట్ నడుస్తూనే ఉంది. ఆ అమ్మాయి యొక్క మెదడులో రక్తం గడ్డ కట్టిందని డాక్టర్ చెప్పారంట. ఈ మూడు రోజుల్లో కనీసం అంటే మూడుసార్లు ఎమ్మారై తీసిన తర్వాత కూడా బంధువులకు పేషెంట్ యొక్క క్రిటికల్ గా ఉందని చెప్పలేదని గురువారం రాత్రి కుటుంబీకులు ఆస్పత్రి ఎదుట ధర్నా చేశారు. పోలీసులు వచ్చి ఎలాగోలా మెప్పించి రాత్రి 11 గంటలకు పంపించారు. బాలిక మృతి చెందడంతో కుటుంబ సభ్యులు కన్నీమున్నీరయ్యారు.