వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డికి మరో షాక్

 సిరా న్యూస్,విజయవాడ;
వైకాపా అధినేత జగన్ మోహన్ రెడ్డికి మరో షాక్ తగలనుంది. భీమవరం మాజీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ అక్టోబర్ 3వ తేదీన వైసీపీకి రాజీనామా చేయనున్నారు. అయన ఇప్పటికే టీడీపీ మాజీ ఎంపీ తోట సీతారామలక్ష్మితో టచ్లోకి వెళ్ళినట్లు సమాచారం. భీమవరం కేంద్రంగా తోట సీతారామలక్ష్మి, మెంటే పార్ధ సారధి, బర్రె నెహ్రూ వంటి నేతలతో రాయబేరాలు చేస్తున్నారు. తన సోదరులతో సీఎం రిలీఫ్ ఫండ్ కు రూ.1 కోటి విరాళం ఇప్పించారు. టీడీపీలో చేరిన వైసీపీ మాజీలతో లాబీయింగ్ చేస్తున్నారు. వైసీపీలోని తన సన్నిహితులతో ఎడతెగని మంతనాలు సాగిస్తునం్టు సమాచారం. అక్టోబర్ 3వ తేదీన వైసీపీకి గ్రంధి శ్రీనివాస్ గుడ్ బై చెప్పనున్నారు. దసరా తరువాత టీడీపీ తీర్ధం పుచ్చుకునే ఆలోచనలో వున్నారు. అయితే భీమవరం తెలుగుదేశం శ్రేణులు మాత్రం గ్రంధి రాకను వ్యతిరేకిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *