Ao Visit: వరి కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన ఏవో రాకేష్…

సిరా న్యూస్, ఖానాపూర్:

వరి కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన ఏవో రాకేష్…

నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలంలోని సత్తనపల్లి గ్రామంలో జిసిసి ఆధ్వర్యంలో కొనసాగుతున్న వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మండల వ్యవసాయ శాఖ అధికారి రాకేష్ పరిశీలించారు. కొనుగోలు కేంద్రాన్ని తనిఖీ చేసిన ఏవో వివిధ సూచనలు అందించారు. స్టాక్ రిజిస్టర్, సేల్స్ రిజిస్టర్ తదితర రికార్డులు తనిఖీ చేశారు. ఆయన మాట్లాడుతూ… కొనుగోలు వివరాలను ట్యాబ్ లో నమోదు చేయాలని ఆదేశించారు. నుండి కొనుగోలు చేసిన వరి బ్యాగులను సైతం ఎప్పటికప్పుడు మిల్లర్లకు తరలించాలని అన్నారు. కాగా ఇప్పటవరకు 19940 బ్యాగ్ లను రైస్ మిల్లులకు తరలించినట్లు కొనుగోలు కేంద్రం నిర్వాహకులు ఏవో కు తెలిపారు. ఆయన వెంట జిసిసి మేనేజర్ బాలాజీ, వరి ధాన్యం కొనుగోలు కేంద్ర నిర్వాహకులు చుంచు ఎల్లయ్య, మల్లేష్, తదితరులు ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *