పిఠాపురంలో ప్రాయశ్చిత్త దీక్ష

సిరా న్యూస్,పిఠాపురం;
తిరుపతి లడ్డూకు జరిగిన అపచారానికి చింతిస్తూ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి,పిఠాపురం నియోజకవర్గ ఎమ్మెల్యే కొణిదెల పవన్ కళ్యాణ్ చేపట్టిన ప్రాయశ్చిత్త దీక్షకు మద్దతుగా పిఠాపురంలో జనసేనపార్టీ నాయకులు,కార్యకర్తలు ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టారు.ఈ ప్రాయశ్చిత్త దీక్షలను పిఠాపురం నియోజవర్గం జనసేనపార్టీ నాయకుడు సూరవరపు సురేశ్ ప్రారంభించారు.ఈ సందర్భంగా తిరుపతి లడ్డూలో కల్తీకి పాల్పడిన వ్యక్తులను వెంటనే కఠినంగా శిక్షించాలని నినాదాలు చేశారు.ఈ సందర్భంగా సూరవరపు సురేశ్,జోగా వేంకటరమణ,చెల్లుబోయిన సతీశ్,తెలగంశెట్టి వేంకటేశ్వరరావు మీడియాతో మాట్లాడారు.ఈ కార్యక్రమంలో మార్నీడి రంగబాబు,తోలేటి శిరీష,రెడ్డెం భాస్కరరావు,జనపరెడ్డి రాంబాబు,చోడిశెట్టి శేషగిరిరావు,వనం వీరబాబు,అంకిరెడ్డి నాగగౌరి,కొత్తెం బాబూరావు,లోవరాజు,డాక్టర్ వరలక్ష్మి,టైల్స్ బాబీ,పిడుగు శ్రీనివాస్,మత్సా అప్పాజీ,వెన్నా చందర్రావు,జోగా రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *