సిరా న్యూస్, ఆదిలాబాద్:
జాతీయ స్థాయి పోటీలకు ఎస్ ఆర్ డీజీ విద్యార్థి…
+ ఆత్యపాట్య పోటీలకు ఎంపికైన ఆదిలాబాద్ విద్యార్థి
+ అభినందించిన ఉపాధ్యాయులు, గ్రామస్తులు
ఆదిలాబాద్ పట్టణంలోని ఎస్ ఆర్ డీజీ పాఠశాలకు చెందిన 9వ తరతగతి విద్యార్థి శ్రీరామీ అభిషేక్ ఆత్యపాట్య జాతీయ స్థాయి క్రీడలకు ఎంపికైనట్లు ఆత్యపాట్య ఆదిలాబాద్ జిల్లా అసోసియేషన్ అధ్యక్షుడు కలాల శ్రీనివాస్ తెలిపారు. ఆదివారం హైదరాబాద్ లో జరిగిన రాష్ట్ర స్థాయి పోటీల్లో జూనియర్స్ విభాగంలో ఉత్తమ ప్రతిభ కనబర్చి జాతీయస్థాయి కి ఎంపికైనట్లు పేర్కొన్నారు. ఈ నెల 26 నుంచి 30 వరకు తమిళనాడు లోని పుదుచ్చేరిలో నిర్వహించబోయే జాతీయ స్థాయి పోటీలకు విద్యార్థి హాజరుకానున్నట్లు తెలిపారు. కాగా ఆదిలాబాదు నుండి జాతీయ స్థాయికి ఎదిగిన విద్యార్థి శ్రీరామీ అభిషేక్ ను ఎస్ ఆర్ సంస్థల జోనల్ ఇంచార్జీ పి శ్రీనివాస్ రెడ్డి, పాఠశాల ప్రిన్సిపాల్ సీ హెచ్ క్రాంతి కుమార్, వైస్ ప్రిన్సిపాల్ సంతోష్, పీఈటీ రూపేష్, ఇతర ఉపాధ్యాయులు, విద్యార్థిని, విద్యార్థులు అభినందించారు. జాతీయ స్థాయిలో సైతం సత్తా చాటాలని ఆకాక్షించారు.