Ayyappa Swamulu: కొండాయిగూడెంలో స్వాములకు అన్నదానం…

సిరా న్యూస్, సూర్యాపేట:

కొండాయిగూడెంలో స్వాములకు అన్నదానం…

సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండలం కొండాయిగూడెం గ్రామంలో అయ్యప్ప దీక్ష మాల ధారణ స్వాములకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. గ్రామానికి చెందిన కర్నే నాగిరెడ్డి, సుమలత దంపతులు ఈరోజు వారి స్వగృహంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. కాగా వారికి, వారి కుటుంబానికి అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలు ప్రసాదించాలని, అయ్యప్ప స్వామి దీవెనలు ఎల్లవేళలా వారిపై ఉండాలని అయ్యప్ప స్వాములు దీవించారు.ఈ కార్యక్రమంలో అఖిలభారత అయ్యప్ప దీక్ష ప్రచార సమితి గరిడేపల్లి మండల అధ్యక్షులు తాళ్ల నరేష్ గురు స్వామి, స్వాములు కేతిరెడ్డి గోపిరెడ్డి, అత్తి నరసింహారావు గారు, సైది రెడ్డి, బూసిపల్లి వీరారెడ్డి, గ్రామంలోని ఇతర అయ్యప్ప స్వాములు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *