సిరా న్యూస్, బేల:
పత్తి కొనుగోళ్లకు బ్రేక్…
ఆదిలాబాద్ జిల్లా బేల మండల కేంద్రంలోని మార్కెట్ యార్డ్ సిసిఐ ఆధ్వర్యంలో కొనసాగుతున్న పత్తి కొనుగోళ్లకు బ్రేక్ పడింది. మార్కెట్ యార్డులో పత్తి నిల్వలు పేరుకపోవడంతో కొనుగోళ్ళను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు మార్కెట్ కార్యదర్శి మధుకర్ ఒక ప్రకటనలో తెలిపారు. కొనుగోలు పున ప్రారంభమయ్యే తేదీలను త్వరలోనే వెల్లడిస్తామని అన్నారు. జైనథ్, బేల రైతులు సహకరించాలని కోరారు.