ధార్మిక పరిషత్ నిర్ణయం మేరకే బ్రహ్మంగారి మఠం పీఠాధిపతి ఎంపిక

ఏపీ హైకోర్టు
సిరా న్యూస్,బద్వేలు;
ధార్మిక పరిషత్ నిర్ణయం మేరకే వీరబ్రహ్మేంద్రస్వామి మఠాధిపతి ఎంపిక చేయాలని హైకోర్టు సూచించింది. మఠాధిపతి ఎంపికపై గత మూడు సంవత్సరాల క్రితం కోర్టును మఠం వారసులు ఆశ్రయించారు. బ్రహ్మంగారిమఠం పీఠాధిపతి ఎంపిక విషయం మళ్లీ తెరపైకి వచ్చింది. విచారణ అనంతరం బ్రహ్మంగారి మఠం పీఠాధిపతి కోసం వచ్చిన మూడు పిటిషన్లను ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కొట్టెసింది. దివంగత పీఠాధిపతి పెద్ద భార్య పెద్ద కుమారుడు వెంకటాద్రి స్వామి, దివంగత పీఠాధిపతి రెండవ భార్య మారుతి మహాలక్ష్మి, దివంగత పీఠాధిపతి రెండవ కుమారుడు వీరభద్ర స్వామి వేసిన పిటిషన్ లను హైకోర్టు డిస్మిస్ చేసింది. ధార్మిక పరిషత్ నిర్ణయం మేరకే పీఠాధిపతి ఎంపిక హైకోర్టు స్పష్టం చేసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *