ఓబులవారిపల్లె రైల్వే స్టేషన్ లో ప్రమాదం
సిరా న్యూస్,అన్నమయ్య;
ఓబులవారిపల్లె రైల్వే స్టేషన్ లో ప్రమాదం జరిగింది. ప్రమాదవశాత్తు లోకో పైలెట్ మృతి చెందాడు. స్టేషన్ లో ట్రైన్ పూర్తిగా ఆగక ముందే లోకో పైలెట్ సుమన్ దిగే ప్రయత్నం చేసాడు. జారి పడడంతో తలకు గాయం అయింది. అక్కడికక్కడే మృతి చెందాడు. రాజంపేట ప్రభుత్వ ఆస్పత్రికి మృతదేహం తరలించారు. ట్రైన్ అరక్కోణం నుంచి కడపకు వస్తుంది. రేణిగుంట రైల్వే పోలీసులు విచారణ చేస్తున్నారు.