సిరా న్యూస్,రాచకొండ;
రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్టు మండలం పిగ్లీ పూర్ గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది. పిగ్లీపూర్ సర్వేనెంబర్ 17 లో సీలింగ్ లాండ్ లో వెంచర్ నిర్మాణం చేస్తుండగా రైతులు అడ్డుకున్నారు. రైతులు, పై వెంచర్ నిర్వాహకులు కర్రలు, రాళ్లతో దాడి జరిపారు. పలువురికి తీవ్ర గాయాలు అయ్యారు. వారిని హాస్పిటల్ కు తరలించారు. రైతులు గతంలో ఈ భూమి అమ్మినట్లు సమాచారం.. మరోసారి ఆ భూమి కావాలని కర్రలతో వెంచర్ కి వచ్చారని వెంచర్ యజమాని అన్నారు. పట్టాదారులు మరియు వెంచర్ యజమాని గోపాల్ యాదవ్ ఇరువర్గాల మధ్యన ఘర్షణ చెలరేగింది. ఫోర్జరీ డాక్యుమెంట్ లను సృష్టించి అధికారులను తప్పు త్రోవ పట్టించాడని బాధితులు ఆరోపించారు. అధికారుల చుట్టూ గత 6 నెలల నుండి తిరిగిన తమకి న్యాయం జరగడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేసారు.
వెంచర్ యజమాని గోపాల్ యాదవ్ మాట్లాడుతూ హెచ్ఎండిఏ పర్మిషన్ తీసుకుని లేఔట్ చేశాను ఇప్పుడు ఈ రైతులు కర్రలతో లోపలికి వచ్చి మా మనుషుల్ని కొట్టారు. ఇరువర్గాల మధ్య దాడి జరగడంతో పలువురికి గాయాలయ్యాయి. అబ్దుల్లాపూర్ మెట్టు పోలీస్ స్టేషన్ కి గతంలో కూడా మేము ఫిర్యాదు చేసాము. ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి ఇదంతా చేస్తున్నారని ఆరోపించారు.